ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగ
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపీలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలు పోసి పెంచిన పాము వారినే కాటేసినట్లు పోలీసుల పరిస్థితి ఉంది. రాయచోటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ని వైసీపీ నాయకులు చితకబాదితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోంది. గతంలో ప్రతిపక్షాలమీద మీసం మెలేసి తొడగొట్టిన అసోసియేషన్ నేడు ఏమైంది. అధికార పార్టీ వారితో గొడవలెందుకని సీఐని పోలీసు పై అధికారులు సర్ధి చెప్పడం అమానుషం. వైసీపీ గూండాల దాడి నుంచి కడప ప్రజలను ఎవరు కాపాడుతారు. సీఐకి రక్షణ కావాలని ఆయన భార్య శ్వేత 100 నెంబర్ కి ఫోన్ చేసి సహాయం చేయమనడం సిగ్గుచేటు’’ అని వర్ల రామయ్య తెలిపారు.