బీజేపీకి ఆర్థికం కంటే రాజ‌కీయమే ప్రాధాన్య‌మైనది

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ప్యానెల్  నివేదిక‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. వ్యాపార‌వేత్త‌ల‌ను ఆక‌ర్షించ‌డంలో దేశం విఫ‌ల‌మైంద‌న్న ప్యానెల్ పేర్కొంది. చైనా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ్యాపారుల‌ను ఆక‌ర్షించ‌లేద‌ని నివేదిక‌లో పేర్కొన‌డం జ‌రిగింది. బీజేపీకి ఆర్థికం కంటే రాజ‌కీయమే ప్రాధాన్య‌మైంద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయానికి ప్రాధాన్య‌మిస్తే ఫ‌లితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్ట‌ర్చూసి ప్ర‌సంగించ‌డం సులువే. ప‌టిష్ట ప్ర‌య‌త్నాలు లేక‌పోతే ఫ‌లితాలు రావ‌డం క‌ష్టం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.