ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ఇక లేరు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78)
చెన్నైలోని తన నివాసంలో శనివారం మృతి చెందారు. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మించిన కాట్రగడ్డ సీతామహాలక్ష్మి, గోరింటాకు , త్రిశూలం, సీతా రామ కళ్యాణం, జానకిర్రాముడు, శ్రీనివాస కల్యాణం, సహా పలు చిత్రాల నిర్మించారు. సంగీత ప్రాధాన్యం కల చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన మురారి అన్ని చిత్రాలకు కేవీ మహదేవన్ సంగీత దర్శకుడు కావడం విశేషం.
ఆయన రచించిన “నవ్వి పోధురు కాక ” పుస్తకం ప్రాచుర్యం పొందింది.