ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ వాయిదా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా డీఎస్సీ వాయిదా వేస్తున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ శ్రీదేవ‌సేన తెలిపారు. న‌వంబ‌ర్ 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, భాషా పండిట్లు, ఎస్జీటీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఎస్‌జీటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీకి న‌వంబ‌ర్ 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.