8వ రోజుకు చేరిన ప్రజాసంగ్రామ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 8వ రోజుకు చేరుకుంది. ఇవాళ నిర్మల్ జిల్లా కండ్లీ సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర కండ్లీ, రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్(W), వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామ్డ వరకు కొనసాగుతుంది. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఇవాళ మామ్డ గ్రామ శివారులో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు.