ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ తోడు దొంగలు

: మాజీ మంత్రి పొన్నాల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ తోడు దొంగలు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వరంగల్‌కి మోదీ రావడం గర్వంగా ఉంది. కొంత బాధగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం ప్రధాని రావాలా? మోదీ పార్టీ కార్యక్రమాల కోసం వస్తున్నారా? అధికారిక కార్యక్రమాల కోసం వస్తున్నారా? ప్రజాధనంతో పర్యటనలు చేస్తారా? 9 సంవత్సరాల్లో కేంద్రం వరంగల్‌కి ఏం చేసిందని ఇప్పుడు సిగ్గులేకుండా వస్తున్నారు? ఎన్నికల ముందు వరంగల్ అభివృద్ధి గుర్తు వచ్చిందా?, కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో సమాధానం చెప్పాలి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నామని నాటకాలు ఆడుతున్నారా? కేసీఆర్ సీఎం హోదాలో మోదీ ముందు తలవంచి మాకేం వద్దు అన్నారని.. మీ ప్రేమ చాలు అన్నారు.’’ అని పొన్నాల చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.