ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఢిల్లీ మెట్రో రైలులో యువతీయువకులుమహిళలతో మోదీ ఎంతో ఆత్మీయంగానవ్వుతూ ముచ్చటించారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా వీరి హావభావాలు కనిపించాయి.ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగావిద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీ టెక్నాలజీ ఫ్యాకల్టీకంప్యూటర్ సెంటర్అకడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఓ సభను ఉద్దేశించి ప్రసంగించారు. 

Leave A Reply

Your email address will not be published.