ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌.. దేశం పేరు మార్పుపై మ‌రో వివాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇండోనేషియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. అక్క‌డ జ‌రిగే 20వ ఆసియ‌న్‌-ఇండియా స‌మ్మిట్‌లో ఆయ‌న పాల్గొంటారు. దీనితో పాటు 18వ ఈస్ట్ ఏషియా స‌ద‌స్సులోనూ ఆయ‌న పాల్గొన‌నున్నారు. అయితే ఆ వేడుక‌ల కోసం రూపొందించిన ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌గా రాశారు. దేశం పేరును మార్చాల‌ని కేంద్ర స‌ర్కార్ భావిస్తున్న నేప‌థ్యంలో.. ఆసియాన్ ఇన్విటేష‌న్ లేఖ‌లో ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన‌డం మరోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాలకు చెందిన డిన్న‌ర్ ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఆ ప‌త్రిక‌పై ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.

Leave A Reply

Your email address will not be published.