వెంకయ్యనాయుడు పై పుస్తకాలు రిలీజ్ చేయనున్న ప్రధాని
తెలంగాణా జ్యోతి వెబ్ న్యూస్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి(Venkaiah Naidu)పై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను రిలీజ్ చేయనున్నారు. వెంకయ్యనాయుడు-లైఫ్ ఇన్ సర్వీస్ అన్న టైటిల్తో వెంకయ్య బయోగ్రఫీ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ద హిందూ హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రాశారు.సెలబ్రేటింగ్ భారత్- ద మిషన్ అండ్ మెసేజ్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు 13వ భారత ఉపరాష్ట్రపతి అన్న టైటిల్తో ఉన్న పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తారు. మాజీ సెక్రటరీ ఐవీ సుబ్బరావు ఈ పుస్తకాన్ని ఫోటోలతో తీర్చిదిద్దారు. తెలుగులో కూడా ఫోటోలతో రూపొందించిన మహానేత-లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్యనాయుడు అన్న పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. సంజయ్ కిషోర్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.