భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ లిల్లీ మేరి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను ప్రిన్సిపల్ లిల్లీ మేరి నేడు పరిశీలించారు.పనులను వేగవంతం చేసి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రిన్సిపల్ లిల్లీ మేరి సూచించారు. ఆమె వెంట అసిస్టెంట్ ప్రొఫెసర్ కమలాదేవి, ఉమామహేశ్వరి, కళాశాల లెక్చరర్స్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.