ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా .. ఇద్దరు చిన్నారుల మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.