డబుల్ ఇంజిన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన ప్రియాంక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డబుల్ ఇంజిన్ సర్కార్.. బీజేపీ నేతల నోటి నుంచి తరచూ వినిపించే మాట. దీని అర్థం చాలా సింపుల్. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ తమ పార్టీనే అధికారంలో ఉంటే.. కేంద్ర.. రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరుగుతుందని.. అందుకు ప్రజలు సహకరించాలంటూ కమలనాథులు అదే పనిగా కోరుతుంటారు.తమ డబుల్ ఇంజిన్ సర్కారు సక్సెస్ అయ్యిందంటూ ఉత్తరప్రదేశ్  రాష్ట్రాన్ని తరచూ చూపిస్తుంటారు. ఒకవేళ.. నిజంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ దేశ వ్యాప్తంగా అమల్లోకి వస్తే.. కేంద్రం చేసే తప్పుల్ని ఎత్తి చూపే వారెవరురాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు బయటకు వచ్చే అవకాశం ఏమిటిఅన్నది ప్రశ్న.ఈ డబుల్ ఇంజిన్ సర్కారు మాటపై విపక్షాలు విరుచుకుపడినా.. అవేమీ పెద్దగా ఆకట్టుకునేలా లేవనే చెప్పాలి. ఈ కొరత తీరుస్తూ.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైనా ప్రియాంక వాద్రా నోటి నుంచి వచ్చిన పవర్ ఫుల్ మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. డబుల్ ఇంజిన్ ఉంటే సరిపోతుందామరి అందులో ఇంధనం పోయటం మర్చిపోతున్నారుఅంటూ పర్ ఫెక్టు పంచ్ వేశారు ప్రియాంక.ప్రస్తుతం జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ చేసిన ప్రియాంక.. అలుపెరుగని రీతిలో శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల నోటి నుంచి వచ్చే డబుల్ ఇంజిన్ సర్కారుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ఉందని.. కానీ ఇంజిన్ లో ఇంధనం నింపటం మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు.బీజేపీ నేతలు వచ్చి.. తమకు ఓటు వేయాలని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెబుతారని.. మరి ఐదేళ్లుగా వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా హిమాచల్ ప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారే ఉందని.. కానీ వారు ఇంజిన్ లో ఇంధనం నింపటం మాత్రం మర్చినట్లున్నారన్న ఎద్దేవా చూశాక.. బీజేపీకి సరైన పంచ్ ఇచ్చిన క్రెడిట్ ప్రియాంకకు వెళుతుందని చెప్పక తప్పదు.

Leave A Reply

Your email address will not be published.