బాన్సువాడలో ప్రోకబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం శంభు రెడ్డిల తల్లి తండ్రులు కీ శే పరిగే పాపమ్మ, పరిగె రాజిరెడ్డి ల జ్ఞాపకార్థం శంభురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ క్రీడలను శుక్రవారం పోచారం శంభు రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ RDO రాజాగౌడ్ గారు బాన్సువాడ DSP జగన్నాథ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆధికారులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.