ఈటెలకు ప్రమోషన్ ?
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈటల రాజేందర్ (Etela Rajendar) కి కీలక పదవి వస్తోంది. త్వరలోనే ఆయనకు ప్రమోషన్. ఇక తెలంగాణ (Telangana) లో ఆయనకు తిరుగుండదు.. సీఎం కేసీఆర్ పై ఊహించని అస్త్రాన్నే బీజేపీ ప్రయోగించబోతోంది. ఇవీ గత వారం, పది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తున్న మాటలు. అంతేకాదు.. అంతా అయిపోయిందని అధికారిక ప్రకటన ఒక్కటే మిగులుందని కూడా పెద్దఎత్తున వార్తలొచ్చాయ్. ఈ వార్తలపై కేంద్రం నుంచి ఎలా రియాక్షన్ రాకపోవడం, పైగా ఖమ్మం సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Central Home Minister Amith shah) రానుండడంతో తెలంగాణలో నెలకొన్ని తాజా పరిణామాలపై ఫుల్ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సభ రద్దయ్యింది. దీంతో నాటి నుంచి నేటి వరకూ ఈటలపై వచ్చిన రూమర్స్కు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. పైగా అగ్రనేతలు కూడా దీనిపై మౌనం పాటిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈటల పదవి, ప్రమోషన్ పై సోషల్ మీడియా కోడై కూసింది కానీ ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే.. సరిగ్గా ఇదే సమయంలో ఈటల రాజేందర్నిన్న మీడియా ముందుకొచ్చారు. దీంతో ఇన్నిరోజులుగా నెలకొన్న ఈ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడుతుందని రాష్ట్ర నేతలు, అభిమానులు, కార్యకర్తలు భావించారు. కానీ.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించడం, ఇంకా కొన్ని విషయాలపై మాట్లాడారు. తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై అమితాషా తో మాట్లాడం తప్ప.. పదవుల గురించి కాదని ఊసూరుమనిపించారు. అంతా అధిష్టానం చేతిలో ఉంది.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటామని రాజేందర్ అన్నరు.