పులులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

తెలంగాణ జ్యోతి/ వేబ్ న్యూస్: పులులువన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీపర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మనుషులు అన్నిరకాల సౌకర్యాలు కోరుకున్నట్లేఅడవిలో అటవీ జంతువులు స్వేచ్ఛ గా బతికేందుకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలంగాణలో పులుల అభయారణ్యం కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియలో మైసంపేట్రాంపూర్ గ్రామ ప్రజలు గ్రామాల తరలింపునకు అంగీకరించారు.దీంట్లో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో ఈ రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు రూ. 21.40 కోట్ల పరిహారాన్ని మంత్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటుతెలంగాణ చరిత్రలో మొదటిసారి పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు అధికారికంగా ప్రారంభమైందని మంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం లో హరితహారంఅడవుల పెంపకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ దనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ప్యాకేజీ ప్రకారం గ్రామస్తులకు అన్ని వసతులు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్ మాట్ ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాం నాయక్విఠల్ రెడ్డిజడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డిఅటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారిపీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్సీసీఎఫ్ శర్వనన్కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీఎస్పీ ప్రవీణ్ కుమార్జిల్లా అటవీ అధికారి హీరామత్ఇతర స్థానిక ప్రజా ప్రతినిదులుఅధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.