రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని రోడ్డుపై నాటు వేసి నిరసన

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బూరుగుపల్లి ఆలూరు రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ నేతృత్వం లో రోడ్డుపై నాటు వేసి నిరసన తెలిపారు.ఈ సందర్బంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ బూరుగుపల్లి గ్రామం నుండి ఆలూరు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలకు నిత్యం విద్యార్థులతో పాటు ఇరు గ్రామాల రైతులు, భూత్పూర్, దివిటి పల్లి,మహబూబ్ న గర్ నుండి నాగర్ కర్నూల్ ఇతర పట్టణాలకు వెళ్లడానికి నిత్యం వేలాదిమంది ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తుంటారని తెలిపారు. రోడ్డు గుంతల మయమైన వర్షం పడితే చెరువులను తలపిస్తుందని ప్రయాణికులు విద్యార్థులు పాఠశాలకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇట్టి విషయమై సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తెసుకేల్లిన ప్రయోజనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో,, బీసీ సేన నియోజకవర్గం కార్యదర్శి రామస్వామి , బీసీ సేన నాయకులు పాల్ మాకుల రఘు, కార్మికు విభాగ మండల అధ్యక్షులు చంద్రమౌళి బీసీ సేనమండల అధ్యక్షులు బొల్లెమోని నిరంజన్, భీమయ్య, ప్రకాష్, కుర్మేష్, రమేష్, శేఖర్, పవన్ లు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.