ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది. సింగపూర్‌ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ను ప్రయోగిస్తున్నారు.డీఎస్ ఎస్‌ఏఆర్‌తోపాటు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ మైక్రో శాటిలైట్‌ వెలాక్స్‌-ఏఎంఎక్స్‌పరిమెంటల్‌ శాటిలైట్‌ ఆర్కేడ్‌’, 3యూ నానోశాటిలైట్‌ స్కూబ్‌-2’, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్‌ నూలయన్‌’, గలాసియా-2, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్‌ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనున్నారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవలే చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.