ఎన్సిడి కిట్లను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో బుదవారం ఏఎంఎం గంగమణి ఆధ్వర్యంలో అంగన్వాడి, సబ్ సెంటర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రబుత్వం ద్వారా వచ్చిన ఎన్సిడి కిట్లను గ్రామ ప్రజా ప్రతినిధుల సుమారు 48 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్లం గ్రామ సర్పంచ్ సరళా శ్రీనివాస్ రెడ్డి ,బాన్సువాడ రైతుబంధు డైరెక్టర్ పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్ ,మాజీ ఎంపీటీసీ పుట్టి లక్ష్మణ్ ,ఏఎన్ఎం గంగమణి ,మరియు సిబ్బంది పద్మ, వరలక్ష్మి, అనురాధ ,సుచిత్ర, సక్కుబాయి మరియు గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు..