రాహుల్ గాంధీ ఓబీసీ సమాజానికి, నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లోని   వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…..

• మోదీ ఇంటిపేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారు. ఓబీసీ ‌సమాజాన్ని అవమానించారు. తక్షణమే రాహుల్ గాంధీ చేసిన తప్పును ఒప్పుకుని ఓబీసీ సమాజానికి, నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలి.

• ఓబీసీలను అవమానించడం, కోర్టులను అవమానించడం, చట్టాన్ని ఉల్లంఘించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. గతంలో ఇందిరాగాంధీ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూనే ఉన్నారు. కోర్టు తీర్పునిస్తే దానిని శిరసావహించకుండా జడ్జీలను కించపర్చడం ముమ్మాటికీ న్యాయ వ్యవస్థను అవమానించడమే.

• ప్రధాని నరేంద్ర మోదీని బదనాం చేయడం ద్వారా ఓబీసీలను కించపరుస్తున్నారు. దేశంలోని ఓబీసీలంతా జాగ్రుతం కావాలి.

• రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో… ఆయనకే తెలియడం లేదు… గతంలో చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు మెట్టికాయలు పెట్టింది. అయినా మారలేదు…

• దురద్రుష్టవశాత్తు ఎంపీ అయ్యానంటూ అత్యున్నత పార్లమెంట్ ను అవమానించిన వ్యక్తి రాహుల్ గాంధీ.

• కాంగ్రెస్ కు పట్టిన శని రాహుల్ గాంధీ. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నరు.

• అయినా మారకుండా ఇతర దేశాలకు పోయి భారత్ ప్రతిష్టను కించపర్చచేలా మాట్లాడటం సిగ్గు చేటు..

• ఇకనైనా కోర్టు తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలి. లేనిపక్షంలో రాహుల్ ను ఈ దేశ పౌరుడిగా సమాజం గుర్తించబోదు.

• 8 ఏళ్లుగా రైతులకు నయా పైసా సాయం చేయని కేసీఆర్ కేంద్రం పైసా ఇవ్వడం లేదని బదనా చేయడం సిగ్గు చేటు.

• 2016‌-17లో కేంద్రం రాష్ట్ర రైతులకు సాయం చేయాలని 916 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 700 కోట్లు కూడా ఖర్చు చేయకుండా గండీ కొట్టి రైతులను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

• మళ్లీ కేంద్రాన్ని సాయం అడిగితే పాత లెక్కలు అడుగుతదనే భయంతో కేసీఆర్ కేంద్రానికి నివేదికలు పంపడం లేదు.

• రైతుల పాలిట శని కేసీఆర్… గతంలో ఇచ్చిన ఫ్రీ యూరియా, రుణమఫీ హామీలను అమలు చేయలేదు.

• అకాల వానలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేస్తోందనడం పచ్చి అబద్దం… నిన్న జారీ చేసిన జీవోలో ఎస్డీఆర్ఎఫ్ నిధులతోనే రైతులకు సాయం చేస్తున్నట్లు చెప్పారు. మరి ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే కదా… ఆ మాట ఎందుకు చెప్పడం లేదు?

• రైతులకు కేసీఆర్ మంచి చేస్తే వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? సమాధానం చెప్పాలే. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, ఆయన కొడుకు కేంద్రంపై బదనాం మోపి తిట్టడం అలవాటైపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.