రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, ఇది దేశ చరిత్ర

.. కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ :

రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, ఇది దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు. దేశం గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని, దేశంలో ప్రజల కోసం ఇంతవరకు ఏ నాయకుడు ఇలాంటి సాహసం చేయలేదన్నారు. దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల కోసం రాహుల్ జి పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం 4 గంటలకే నిద్ర లేచి రోజు 25 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారాణి తెలిపారు. భారత్ జోడో యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని, జన సమీకరణ కోసం చర్యలు తీసుకుని. కల్చరల్ యాక్టివిటీస్ కోసం కమిటీలను వేసుకోవాలని సుంచించారు. రైతులు , ఆశా వర్కర్లు, వివిధ వర్గాలను రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్ కోసం ప్రత్యేక కమిటీని నియమించాలి. ప్రతి గ్రామంలో రాహుల్ గాంధి పాదయాత్ర పైన చర్చ జరగాలి. స్థానిక అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ సాంస్కృతిక గ్రూప్ లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి అన్నారు. ఎల్లుండి నాటికి రాహుల్ పాదయాత్ర 1000 కి.మీ కు చేరుకుంటుందని బీజేపీ, సంఘ్ పరివార్ రాహుల్ యాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాహుల్ ను వారు డీమోరల్ చేయాలని చూసినా.. ప్రజలు రాహుల్ డైనమిజంను చూస్తున్నారని తెలిపారు. గతంలో రాహుల్ మీద మాట్లాడిన వారు ఇప్పుడు ఆయన సాహసంతో చేస్తున్న యాత్ర ను చూసి భయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఐక్యంగా ఉందని ఈ యాత్ర ద్వారా చాటిచెప్పాలి. ఒక్కరు పని చేస్తే విజయం సాధించము.. అంత కలిసికట్టుగా పని చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.