విద్యా సంబంధ సమస్యలపై ప్రముఖులతో భేటీ కానున్న రాహుల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యా సంబంధ సమస్యలపై శనివారం మద్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య వివిధ సంస్థలు,ప్రముఖులతో రాహుల్ గాంధి భేటీ కానున్నారు. పాలమూరు విద్యావంతుల వేదిక తరపున ప్రో. హరగోపాల్, రఘు ఆచారి, ఎం. వి ఫౌండేషన్ తరపున వెంకట్ రెడ్డి, లతో పాటు స్వచ్చంద సంఘాల నాయకులు నీలిమ, విద్యార్థి నాయకులు రాహుల్ గాంధీ తో ఏనుకొండ క్యాంప్ లో భేటీ అవుతారు. సమగ్ర విద్యా విధానం, ఫీజు రీఎంబెర్స్ మెంట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీ లలో సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తారు.

 

Leave A Reply

Your email address will not be published.