హైదరాబాద్ అభివృద్ధి రజనీకి అర్థమైంది కానీ గజినీలకు కావట్లేదు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్ అభివృద్ధి రజినీకి అర్థమైంది.. కానీ గజినీలకు కావట్లేదు.. ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ రావు సెటైర్ విసిరారు.గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు.