పార్టీ మారినట్లు వచ్చిన పుకార్లు ఖండించిన రామన్న యాదవ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈనెల ఒకటో తేదీన మా అమ్మ కాలం చేసింది కావున మా చిన్న అన్నా మేకల ధర్మయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ మైలారం సొసైటీ డైరెక్టర్ కాబట్టి మొన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి  మా ఇంటికి రావడం జరిగింది. దీనిని పరిగణలోకి తీసుకుని కొందరు నేను బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరినట్లు పుకార్లు చేస్తున్నారు వీటిని తాను ఖండిస్తున్నాను అని బిజెపి నసురుల్లాబాద్ మండల నాయకులు మేకల రామన్న యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ పరమార్చించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాతో మాట్లాడి మాకు ధైర్యం చెప్పినారు తరువాత విలేకరులతో మాట్లాడడం జరిగింది దానికి కొంతమంది నాయకులు మేకల రామన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడని లేని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను  ఏ పాటిలోకి చేరలేదని, నసురుళ్లబాద్ మండల బీజేపీ నాయకులకు కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని మేకల రామన్న యాదవ్  విన్నవించారు.

Leave A Reply

Your email address will not be published.