విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ కమిషనర్ గా రంగనాథ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మ‌ల్టీజోన్ వ‌న్ కు ఐజీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగ‌నాథ్ కొత్త బాధ్య‌త‌లు ప్ర‌భుత్వం అప్ప‌గించింది.. తాజాగా ఆయ‌న‌ను జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్‌ను నియమించింది.

హైద‌రాబాద్ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆగం అగ‌మ‌వుతున్నది.. దీనిని దృష్టిలో ఉంచుకుని స‌మ‌ర్ధుడైన ఐపీఎస్ అధికారి ఏవీ రంగ‌నాథ్ ను ఏరి కోరి రేవంత్ ప్ర‌భుత్వం జిహెచ్ఎంసి, విప‌త్తు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్‌గా నియమించింది. అలాగే విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విధుల‌ను కూడా అయ‌న‌కే కేటాయించింది.

Leave A Reply

Your email address will not be published.