సరస్వతి మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సరస్వతీ దేవిపై రెంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాసరలో అమ్మవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులతో పాటు పలువురు నిరసనకు దిగారు. బాసరలో బంద్ నిర్వహిస్తున్నారు. రాజేష్‌పై పిడి యాక్ట్ పెట్టాలని రాస్తారోకోకు దిగారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాసర అమ్మవారి ఆలయ అర్చకులు రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కనే రెంజర్ల రాజేష్ కూడా ఉన్నారు. వివాదం ముదిరిన సందర్భంలో బైరి నరేష్‌కు సోషల్ మీడియాలో మద్దతు తెలిపి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.

Leave A Reply

Your email address will not be published.