తెలంగాణ అభివృద్ధి పై చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా రెడి.

.. ఎమ్మెల్సీ భానుప్రసాద్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అభివృద్ధిపై  ఎక్కడ చర్చకు పిలిచిన తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీని కేసీఆర్ తిట్టడం లేదని బాధపడుతున్నారు బండి సంజయ్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒక్క రూపాయి ప్రయోజనం లేదని,  బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేయాలన్నారు. పాదయాత్ర చేసి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తేవాలి.12లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దేశంలోని విద్యా వ్యవస్థ బాగుపడేది. పిచ్చి మాటలతో తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ప్రజలకు ఎం చేస్తారో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఈ పని చేస్తామని ఎప్పుడైనా బండి సంజయ్ చెప్పారా అని ప్రశ్నించారు. టీఆరెస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళిక ఉంది. సంజయ్ కి తెలివి ఉంటే తెలంగాణ అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చి అక్కడ చూసి రావాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఒక్కో ప్రాజెక్టులో 30శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. బండి సంజయ్ తన ఎంపీ పరిధిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి? గత 2018 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో డిపాజిట్లు రాలేదన్నారు. ఇప్పుడు కూడా 100కు పైగా సీట్లలో అభ్యర్థులు లేరు బీజేపీకి లేరు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.