ఎయిడ్స్ డే సందర్భంగా లలితాదేవి అమ్మవారికి పారాయణం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఎయిడ్స్ డే సందర్భంగా ఖైరతాబాద్ వెంకట రమణ కాలనీ వెంకట లోని రమణ మహిళా మండలి అధ్యక్షురాలు L. అనురాధ గారు(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ M. C సభ్యులు) ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎయిడ్స్ అనే మహమ్మారిని తరిమి కొడదాం అని మహిళ చే లలితా దేవి అమ్మవారి కి పారాయణం చేశారు. ఆ తర్వాత వన భోజనాలు పార్కు లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ శ్రీ మామిడి భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.M. M. U ద్వారా ప్రతి నెలా హెల్త్ క్యాంప్ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెంకట రమణ మహిళా మండలి సభ్యులు సరళ, రత్నంబా, D. సురేఖ, శ్యామల, B. సరోజిని, సుగుణ, కుమారి , G. వనిత, కిరణ్మాయి, W. పద్మావతి, గౌరి, మాధవి, మరియు రెడ్ క్రాస్ ఆఫీసు స్టాఫ్ సభ్యులు AP లక్ష్మి, T. సత్య లక్ష్మి, G. స్వరూప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.