తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కూహానా మేధావులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. త్వరలో రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామని, ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్.. టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినాయి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు.