క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలు నమోదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలం సంగెం శివారులో రైతులు పండిస్తున్న పంటలు క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలను నమోదు చేసుకోవడం జరగింది.మొత్తం శివారులో వరి 674 ఎకరాలు ,మొక్కజొన్న 186 ఎకరాలు రైతులు సాగు చేశారని తెలపడం జరగింది..ప్రస్తుతం వరి లో కాండం తొలుచు పురుగు(మోగి పురుగు ) ఉధృతి బాగా ఉందని ,పురుగు ఉధృతిని గమనించిన వెంటనే కార్తప్ హైడ్రో క్లో రైడ్ 50% 2 గ్రాముల లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని లేదా కర్బాఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి పది కిలోలు వేసుకోవాలని రైతులకు తెలిపారు.గ్రామ విస్థిరణ అధికారి జ్ఞానేశ్వర్ ,గ్రామ రైతు బంధు అధ్యక్షులు గొల్ల సాయిలు యాదవ్ గారు, సర్వన్ రైతులు పాల్గొన్నారు .