5,204 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. న్యూఇయ‌ర్ వేళ న‌ర్సింగ్ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. 5,204 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. డీఎంఈ, డీహెచ్ ప‌రిధిలో 3,823 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 757 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.డీఎంఈ, డీహెచ్ – 3,823,వైద్య విధాన ప‌రిష‌త్ – 757,ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ – 81,డిజ‌బుల్డ్, సినీయ‌ర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8,తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్స్ – 127,బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 197,ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 74,సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124,తెలంగాణ రెసిడెన్షియ‌ల్స్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్ – 13

Leave A Reply

Your email address will not be published.