పట్టణ ప్రగతి కింద రూ.4304 కోట్లు విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది పట్టణ ప్రగతి కింద ఫిబ్రవరి’20 నుంచి రూ.4304 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నిధుల్లో రూ.3936 కోట్లు (91.44%) వినియోగంపట్టణ ప్రగతి తో 142 పురపాలికల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాయుతమైన పద్దతిలో మౌలిక వసతులు కల్పిం చుటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న ది. వినూత్న వరవడితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. టి. రామారావు నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంతో   దేశంలో ప్రామాణిక నగరాలు,  పట్టణాలు ఉన్న రాష్ట్రంగా ప్రతి యేటా తెలంగాణ కు జాతీయ అవార్డులు అందుతున్నాయి.  పట్టణ ప్రగతి కింద ఫిబ్రవరి’20 నుంచి జిహెచ్ఎంసి తో పాటు 142 పురపాలక సంస్థలకు రూ.4304 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు రూ.3936 కోట్లు అంటే దాదాపు 92 % నిధులను పురపాలక సంస్థలు వినియోగించుకున్నవి.  అందులో జిహెచ్ఎంసి కి రూ.2276 కోట్లు, మిగిలిన 141 పురపాలికలకు రూ.2028 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు పురపాలక సంస్థలకు ఆర్థికంగా చేయుతగా నిలుచుటకు పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం నెల   నెలా నిధులు ఇస్తున్నది. అందులో భాగంగా 2022-23 లో ఫిబ్రవరి వరకు నెలకు రూ.116 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఈ నిధుల్లో జిహెచ్ఎంసి కి నెలకు రూ.61 కోట్లు, ఇతర (141) పురపాలక సంస్థలకు రూ.55 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది.      పర్యావరణ పరిరక్షణ , శానిటేషన్ పైన పురపాలక సంస్థలు  ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి మినహా 141 పురపాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,356 టన్నుల చెత్తను సేకరీస్తున్నవి. ఇంటింటికి తిరిగి 100% చెత్తను సేకరించి, తరలించుటకు కొత్తగా 2165  పారిశుధ్య వాహనాలుకొనుగోలు చేసినరు.  గతంలో ఉన్న 2548 పారిశుధ్య వాహనాలు ద్వారా రోజుకు 2675 టన్నుల చెత్తను మాత్రమే సేకరించి తరలించేవారు. ప్రస్తుతం పారిశుధ్య చెత్త సేకరణ వాహనాలు సంఖ్య  4713 కు పెరుగుట వలన శానిటేషన్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి 141 పురపాలక సంస్థల్లో మొత్తం 1233 ఎకరాల విస్తీర్ణంలో డంప్ యార్ధులను ఏర్పాటు చేశారు.  చెత్తను తడి, పొడిగా విడదీయుట కు 206 డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుటకు 229 కంపోస్టు బెడ్స్ ను నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జిహెచ్ఎంసి మినహా ఇతర చోట్ల రూ.428 కోట్లతో రోజుకు 2035 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన 139 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 20 చోట్ల పూర్తయిన వి. 14 చోట్ల పనులు తుది దశలో ఉన్నాయి. 49 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో వున్నవి. మరో 50 చోట్ల పనులు ప్రారంభం కానున్నాయి.  పచ్చదనాన్ని పెంపొందించటానికి గ్రీన్ ఏక్షన్ ప్లాన్ ను పురపాలక సంస్థల్లో ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్నది. 141 పురపాలక సంస్థల్లో వున్న 3468 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు కింద ట్రీ పార్క్ లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా 2021 నుంచి ఇప్పటి వరకూ 34 .59 లక్షల మొక్కలను నాటారు. తెలంగాణకు హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. 2023-24 లో 141 పురపాలక సంస్థల్లో 2.14 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా 1012 నర్సరీ లలో 2.36 కోట్ల మొక్కలు పెంచుతున్నారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 141 పురపాలికల్లో  796 స్ట్రెచ్ లలో 1208  కిలోమీటర్లకు పొడవున పలు రకాల మొక్కలు నాటారు. పచ్చదనం పెంపుదల పనులకై 141 పురపాలికల్లో ఇప్పటివరకు రూ.779 కోట్ల నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించారు. అలాగే హరిత నిధి కింద ట్రేడ్ లైసెన్స్ దారుల నుంచి రూ 128 .97 లక్షలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు నుంచి రూ.14.28 లక్షలు కలిపి మొత్తం రూ.1 కోటి 43 లక్షల 25 వేలు జమ అయ్యాయి. 141 పురపాలక సంస్థల్లో ప్రభుత్వం 453 వైకుంఠదామము లను మంజూరు చేసింది. వాటిలో 297 వైకుంఠ దానములు పూర్తయ్యాయి. మరో 149 చోట్ల  చేపట్టిన పనులు పురోగతిలో వున్నవి. ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత , అభివృద్ధి పనులతో   తెలంగాణ లోని పురపాలక సంస్థ లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నవి.

Leave A Reply

Your email address will not be published.