ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులు గురువారం కలిశారు. ఉద్యోగుల వేతన సవరణ, ఆరోగ్య పథకంపై చర్చించారు. వేతన సవరణ కమిషన్తో పాటు మధ్యంతర భృతిపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆరోగ్య పథకం అమలు చేస్తామన్నారు. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బీటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ భూమి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయవలసినదిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.