ఆర్టీసీ చైర్మన్ ను కలిసిన విశ్రాంత ఉద్యోగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ శ్రీ.బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కలిసిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు దీపావళి రోజున ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి సంఘం నిజామాబాదు రీజనల్ కమిటీ అధ్వర్యం లో ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గార్కి పుష్ప గుఛ్ఛం ఇచ్చి ,దీపావళి శుభాకాంక్షలు తెలిపినారు.అలాగే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు చాలా సంవత్సరాల నుండి బకాయి ఉన్న ,,సకల జనుల సమ్మె డబ్బులు,,సి.యం. కే సి ఆర్ తో మాట్లాడి,ఒప్పించి ఇప్పిస్తున్నందుకు క్రృతజ్నతలు తెల్పినారు . అలాగే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు సూపర్ లగ్జరీ ,ఇంటర్ స్టేట్ లలో కూడా ఫ్రీగా ప్రయాణం చేయుటకు అనుమతి కోరడమైనది . దీనికి చైర్మన్  ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలా సహకారము ఉంటుంది అన్నారు ..ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఆనందం, పోశెట్టి, డి.రాజు. బాన్సువా నుండి డి.శంకర్. R.s. నారాయణ..A.S.రావ్.ఇంకా కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.