బీఆర్ఎస్ ఆమోదంపై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘గులాబీ కూలీ’ పేరుతో టీఆర్ఎస్ నేతలు వందలాది కోట్ల రూపాయలను వసూలు చేశారని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు కోరినా, ఎటువంటి చర్య లేదని రేవంత్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రత్యర్థులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.