రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 7 వరకు తమ లక్ష్యాలను పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.