శ్రీశైలం జలాశయానికి పెరుగుతోన్న వరద నీటి ప్రవాహం

10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ ; తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3,60,802 క్యూసెక్కులు కాగాఔట్‌ఫ్లో 2,85,809 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగాప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగాప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం కుడిఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది

Leave A Reply

Your email address will not be published.