హైదరాబాద్ లోని పంజాగుట్ట పరిధిలో దారి దోపిడీ

పోలీసులమని నమ్మించి18 లక్షల నకిలీ పోలీసుల దారి దోపిడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పరిధిలో దారి దోపిడీ జరిగింది. ఈ దోపిడిలో భారీగా సోమ్ము పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బేగంబజార్‌కి చెందిన ఒక వ్యాపారిని ఎన్నికల కోడ్‌లో భాగంగా సోదాలు చేస్తున్నామని నకిలీ పోలీసులు నమ్మించారు. కారులో పంజాగుట్ట వైపు వస్తున్న వ్యాపారిని బురిడి కొట్టించి సోమ్ము మాయం చేసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వ్యాపారి దగ్గర బ్యాగులో ఉన్న 18 లక్షల రూపాయలను దొంగలు కొట్టేసి పారిపోయారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. దారి దోపిడీ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల కోసం దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.