గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25 పెంపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25 వడ్డించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు (OMCs) ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1768కి చేరింది. ఇక ముంబైలో రూ.1721కి పెరిగింది.తాజా పెంపుతో కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి చేరింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1105గా ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.