దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టిసి ప్రత్యేక బస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు రాష్ట్రంలో ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా 5,265 అదనపు సర్వీసులను దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం నడుపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అయితే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవనిసాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.