బాన్సువాడ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణజ్యోతి/బాన్సువాడ ప్రతినిది: బాన్సువాడ పట్టణంలో బుధవారం తెలంగాణ శాసనసభ్యులు సభాపతి ఆధ్వర్యంలో బాన్స్ వాడ పట్టణ క్రీడాకారుల ప్రాంగణంలో విజయ దశమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో రావణదహనం, మందు గుండు బాణా సంచా ప్రదర్శన పట్టణ ప్రజలు చిన్నారులు ఆనందోత్సహాలతో పులకించిపోయారు. దసరా పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సభాపతి,బాన్స్ వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దసరా ఉత్సవం విజయానికి నాందిగా ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని కోరుతూ అధర్మం పై ధర్మం విజయం సాధించిన రోజుగా అభివర్ణిస్తూ ప్రజల కష్టాలు తొలిగిసుఖ సంతోషాలు కలిగిన సందర్బంగా రావణ కాష్ట కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం విజయానికి నాందిగా జరుపుకొంటున్నామన్నారు. విజయదశమి సందర్బంగా నియోజకవర్గంలోని ప్రజలకు పట్టణ,మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.రావణ కాష్ఠ సందర్బంగా చేసిన బాణాసంచాతో వివిధ రకాల మందు గుండు సామాగ్రి తో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చూపరులను పట్టణ ప్రజలను ఎంతో ఆకట్టుకొన్నాయి.ఈ కార్యక్రమంలో టీ ఆర్ యస్ నాయకులు పట్టణ, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.