ఈనెల 12న జిల్లా కేంద్రంలో సదరం శిబిరం ఏర్పాటు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ నెలలో జరగనున్న సదరం క్యాంపులను సదరం సర్టిఫికెట్ లేని కామారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని శనివారం రోజున తెలంగాణ వికలాంగుల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జంగం శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హలీం, ఉపాధ్యక్షులు దెబ్బతి రాజశేఖర్ సూచించారు. ఈ నెలలో 12, 13, 19, 20, 26, 27 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నారని ఈనెల 8 నుండి మీసేవ కేంద్రాల్లో స్లాట్ లు బుక్ చేసుకోవాలని సూచించారు.