అభివృద్ధిలో ఆదర్శంగా సనత్ నగర్ నియోజకవర్గం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా సనత్ నగర్ డివిజన్ లోని శ్రీరాం నగర్ లో 1.92 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు నిర్మాణ పనులను, బాలయ్య నగర్ లో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా మాతా టెంట్ హౌస్ వద్ద 39 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ పనులు, దాసారం బస్తీ లో 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను, నాగారాజేశ్వరి నగర్ లో 22.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులు, సనత నగర్ మెయిన్ రోడ్ పై 64 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డివైడర్స్ నిర్మాణ పనులను టయోటా షో రూమ్ వద్ద ప్రారంభించారు. లింగయ్య నగర్ లో 13 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.