ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై చెప్పుల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడిచేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరువరం పుత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని యువజన సంఘాల నాయకులు మహాధర్నా నిర్వహిస్తున్న సమయంలో బెజ్జంకి వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఒక్కసారిగా యువకులు చెప్పులు విసిరారు. కాన్వాయిని అడ్డుకొని దాడికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి యువకులను చెదరగొట్టారు. దాడికి పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ధర్నా చేస్తున్న యువజన సంఘాల నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ సంఘీభావం తెలియజేశారు.

ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై చెప్పుల దాడి..

Leave A Reply

Your email address will not be published.