సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం షుగర్ లెవల్ పడి పోవడంతో ఆయనను యశోద ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు. అక్కడి చికిత్స తీసుకుంటున్నసమయంలోనే కార్డియాటిక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా 1951 మార్చి 5న సాయన్న జన్మించారు.టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు.టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని సాయన్న ప్రారంభించారు. 1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఆయన్ను నియమించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటతో సాయన్న.. బీఆర్‌ఎస్ కార్యాక్రమాలకు దూరంగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.