ఆగస్టు 16 నుండి ఓయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో నిర్వ‌హించాల్సిన పీజీ రెండునాలుగో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను రీ షెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వ‌హించాల్సిన సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 16 నుంచి నిర్వ‌హించాల‌ని ఓయూ అధికారులు నిర్ణ‌యించారు. రెండునాలుగు సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.ఓయూ వీసీ ప్రొఫెస‌ర్ డీ ర‌వీంద‌ర్రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ పీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో పీజీ సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి క్యాంప‌స్అనుబంధ కాలేజీలుజిల్లా పీజీ సెంట‌ర్ల ప్రిన్సిపాల్స్‌తో పాటు ఎగ్జామినేష‌న్ బ్రాంచ్ అధికారులు హాజ‌ర‌య్యారు.పీజీ సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ వాయిదా వేయాల‌ని ఇటీవ‌లే ఓయూ విద్యార్థులు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. సిల‌బ‌స్ పూర్తి కానీ సంద‌ర్భంగా ఎగ్జామ్స్ వాయిదా వేయాల‌ని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొత్తానికి ఎగ్జామ్స్‌ను ఆగ‌స్టు 16 నుంచి నిర్వ‌హించ‌నున్నారు. జులై 26, 27 తేదీల్లో ఇంట‌ర్న‌ల్ ఎగ్జామ్స్ కండ‌క్ట్ చేయ‌నున్నారు

Leave A Reply

Your email address will not be published.