టీపీసీసీ శిక్షణా కార్యక్రమానికి సీనియర్లు గైరాజరు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోసారి షాకిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి సీనియర్లు గైర్హజరయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశించినప్పటికీ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, వీహెచ్ హనుమంత రావు, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి.. శిక్షణా కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ముద్రపడినవారిలో భట్టి విక్రమార్క, కోదండ రెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.కాగా, గత నెల 17న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి, మధుయాష్కీ, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలైన ఒరిజినల్ కాంగ్రెస్ తమదనని, వలస వచ్చిన నాయకులతో పోరాటం చేస్తామని స్పష్టం చేసిన విషయం విధితమే.