మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. గురువారం ఉదయం ముంబై గోవా హైవేపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5 పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో నాగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా.. చిన్నారిని మంగాన్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం గోవా, ముంబై హైపై రాయ్ ఘడ్ జిల్లాలోని రేపోలి వద్ద జరిగింది.

ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లారీ ముంబై వెళ్తుండగా.. కారు రత్నరిగి జిల్లాలోలని గుహర్ వైపు వెళ్తుంది. ఘటన స్థలిలో కారు నుజ్జునుజ్జు అయింది.లారీ ముందు భాగం దెబ్బంది. దృశ్యాలు రోడ్డు ప్రమాదాన్ని కళ్లకు కట్టాయి. ఈ ప్రమాదంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.