ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు

.. ప్రకాష్ రాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం రాజకీయాలలో సంచలనంగా మారింది. తెలంగాణా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలను ప్రదర్శించి మరీ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిర పరచటం కోసం ఈ తరహా చర్యలకు దిగుతుందని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ ముఖ్య నాయకులు ఇదంతా టీఆర్ఎస్ పార్టీ సృష్టి అని, దీనికి కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అంతా కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో రివర్స్ ఎటాక్ చేశారు. ఇక ఈ సమయంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ మరోమారు బీజేపీని టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీని టార్గెట్ చేసిన సినీనటుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీ గ్యాంగ్ అంటూ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా మండిపడిన ప్రకాష్ రాజ్ ఢిల్లీ కి చెందిన సిగ్గు లేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాన మర్యాదలను అమ్ముకున్న వాళ్ళు, ప్రజా స్వామ్యాన్నే వేలానికి పెట్టారు అంటూ ట్వీట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ ప్రదర్శించిన వీడియో ను ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.