సోనియా రాహుల్ ను కలిసిన షర్మిల

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఎపిసిసి అధ్యక్షులు షర్మిల కలిశారు. సోమవారం నాడిక్కడ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్‌ తదుపరి కార్యాచరణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్‌ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణ, వీటన్నింటిపై ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తిరిగి పున్ణ వైభవం సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఒక బలమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని షర్మిల అన్నారు

Leave A Reply

Your email address will not be published.