తాను కూడా కేయూ అధికారులబాధితురాలిని

- సరైన అర్హత ఉన్నా తనకు పీహెచ్‌డీ అడ్మిషన్ ఇవ్వలేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాను కూడా కేయూ అధికారులబాధితురాలినని.. సరైన అర్హత ఉన్నా తనకు పీహెచ్‌డీ అడ్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కవ్యాఖ్యానించారు. కాకతీయ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల జాక్ నేతల దీక్షకు సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో విద్యార్థులతో కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపటి కేయూ జాక్ వరంగల్ బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..‘‘ఉద్యమాల, పోరాటాల గడ్డ వరంగల్‌కు కాకతీయ యూనివర్సిటీ తలమానికం. త్యాగాల స్ఫూర్తిని నింపుకున్న ఎందరినో కాకతీయ యూనివర్సిటీ దేశానికి అందించింది.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమ స్ఫూర్తిని చంపేశారు.కేయూలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలని అడిగితే సీట్లు ఇవ్వట్లేదు. విద్యావ్యవస్థను పక్క దారి పట్టిస్తున్నారు.చదువు కావాలంటే గొర్లు, బర్లు తీసుకోండని ప్రభుత్వం చెప్తోంది. పోలీసులు కూడా అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు.చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న పోలీసు విద్యార్థుల గురించి ఆలోచించాలి. స్టూడెంట్స్‌ను గుండాలుగా చిత్రీకరించొద్దు.పోలీసులు విద్యార్థుల చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.విద్యార్థులను వేధిస్తే తిరగబడి తరిమి కొడతారు జాగ్రత్త.విద్యార్థులపై పైశాచిక దాడిని ఖండించారు.వీసీ, రిజిస్ట్రార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమార్కులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. విద్యార్థుల వరంగల్ బందుకు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని సీతక్క తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.